*కురుక్షేత్ర యుద్ధ సమయం ఆసన్నమైంది: కొండూరు సుధాకర్*
కురక్షేత్ర యుద్ధ సమయం ఆసన్నమైందని *సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండూరు సుధాకర్ * తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, రేపటి నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మరియు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ అగ్ర నాయకులు ప్రచారం ప్రారంభిస్తారని కొండూరు సుధాకర్ పేర్కొన్నారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం యువతను నట్టేట ముంచిందని, ప్రభుత్వ అసమర్థత వల్లే రెండు సార్లు గ్రూప్ -1, 2 పరీక్షలు రద్దు చేశారని దుయ్యబట్టారు. బిఆర్ఎస్ మ్యానిఫెస్టోలో చిత్తశుద్ధి కనిపించడంలేదని కొండూరు విమర్శించారు.